Monday, 14 September 2015

లైవ్‌లో కొట్టుకున్న స్వామీజి & జ్యోతీష్కురాలు...


టీవీ చానల్స్ డిస్కషన్స్‌లో ఫైటింగ్ సీన్స్‌ కామనైపోయాయ్.  ప్రముఖ నేషనల్ ఛానల్ నిర్వహించిన చర్చలో పాల్గొన్న ప్రతినిధులు లైవ్‌ జరుగుతుండానే ఘర్షణకు దిగారు. ఓ ఛానల్ నిర్వహించిన చర్చలో హిందూ మహాసభకు చెందిన ఓంజీ, మహిళా జ్యోతిష్యురాలు రాఖీ బాయి మధ్య వివాదాస్పద రాధేమా వ్యవహారం గురించి మాటమాట పెరిగింది. చర్చిలో పాల్గొన్న మరో మహిళ దీపాశర్మపై వివాస్పద వ్యాఖ్యలు చేశారు ఓంజీ.  అప్పటివరకు నిశ్శబ్ధంగా ఉన్న మహిళ ఒక్కసారిగా ఓంజీ దగ్గరకు వచ్చి మాములుగా మాట్లాడింది. అంతలో ఎమైందో తెలియదు కాని ఇద్దరు పరస్పరం దాడులకు దిగారు. తనపై జీ అసభ్యంగా మాట్లాడడని దీపాశర్మ ఆరోపిస్తోంది. ఆమె మొదట దాడి చేసిందని ఓమ్‌జీ అంటున్నాడు. ఈ విడియో సోషల్ మిడియాలో హల్ చల్ చేస్తోంది.